
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో హామ్స్ టెక్ ఫ్యాషన్–2024 శుక్రవారం ఉత్సాహంగా సాగింది. వివిధ ఫ్యాషన్ డ్రెస్సులో హామ్స్ టెక్ ఇనిస్టిట్యూట్ స్టూడెంట్లు ర్యాంప్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. సస్టెనబిలిటీ థీమ్తో 200 మంది డిజైనర్లు, వెయ్యికి పైగా డిజైన్లతో తమ క్రియేటివ్ కలెక్షన్లను ప్రదర్శించారు.
ఈ ఫ్యాషన్ షో ద్వారా స్టూడెంట్లకు వారి కలెక్షన్లను ప్రదర్శించే అవకాశం కల్పించామని హామ్స్ టెక్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అజితా రెడ్డి తెలిపారు. స్టూడెంట్ల కాన్ఫిడెన్స్, నెట్ వర్క్ను తెలుసుకోవడానికి ఈ షో ఉపయోగపడుతుందని నేషనల్ అవార్డ్ విన్నర్, ఫ్యాకల్టీ నీతా లుల్లా పేర్కొన్నారు.