
కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది అలర్ట్గా ఉండాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్ట సర్కిల్ ఆఫీస్ ఆవరణలోని డీఆర్ఎఫ్ ఆఫీస్, నర్సరీని ఆకస్మిక తనిఖీ చేశారు. బల్దియా ఆఫీస్లో బోట్లను పరిశీలించి పని తీరుపై ఆరా తీశారు. నర్సరీని సందర్శించిన ఎలాంటి మొక్కలు పెంచుతున్నారని, వనమహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఈ, సీపీలు శ్రీనివాస్, రవీందర్, రాడేకర్, ఈఈలు రవికుమార్, మాధవీలత, ఏసీపీ రజిత, డీఈ రాజ్ కుమార్, టీపీఎస్ రోజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రేటర్పరిధిలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని మోరీలను బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకాడేతో కలిసి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.