డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్​గా ఉండాలి

డీఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్​గా ఉండాలి

కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో డిజాస్టర్ రెస్పాన్స్  ఫోర్స్ సిబ్బంది అలర్ట్​గా ఉండాలని బల్దియా మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్ట సర్కిల్ ఆఫీస్​ ఆవరణలోని డీఆర్ఎఫ్ ఆఫీస్​, నర్సరీని ఆకస్మిక తనిఖీ చేశారు. బల్దియా ఆఫీస్​లో బోట్లను పరిశీలించి పని తీరుపై ఆరా తీశారు. నర్సరీని సందర్శించిన ఎలాంటి మొక్కలు పెంచుతున్నారని, వనమహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలని సూచించారు.

 కార్యక్రమంలో ఇన్​చార్జి ఎస్ఈ, సీపీలు శ్రీనివాస్, రవీందర్, రాడేకర్, ఈఈలు రవికుమార్, మాధవీలత, ఏసీపీ రజిత, డీఈ రాజ్ కుమార్, టీపీఎస్  రోజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రేటర్​పరిధిలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని మోరీలను బల్దియా కమిషనర్​ అశ్విని తానాజీ వాకాడేతో కలిసి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.