ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెరగాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల నమోదు పెరగాలి : కలెక్టర్ స్నేహ శబరీశ్

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, అంగన్ వాడీ కేంద్రాల్లో విద్యార్థుల నమోదు పెరగాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో విద్యాశాఖ, ఇంటర్మీడియట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల అధికారులు, ఎంఈవోలతో ఆమె రివ్యూ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడేండ్లు దాటిన చిన్నారులను అంగన్ వాడీ కేంద్రాల్లో చేర్చేలా చూడాలన్నారు. సర్కారు బడుల్లో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ మూడు వేలకు పైగా పెంచాలన్నారు. డీఈవో వాసంతి, డీడబ్ల్యూవో జయంతి, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేశ్ తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిధిలో చేపట్టిన భూ సేకరణపై కలెక్టర్ సంబంధిత ఆఫీసర్లతో సమీక్షించారు. హైవే నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ, పరిహారం పెండింగ్ ఎంతుందో ఆరా తీశారు. అనంతరం భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. భూభారతి సమస్యలను వెంటనే పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్వో వైవీ గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీవో లు తదితరులు పాల్గొన్నారు.