యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలి ఫొటోలు, వీడియోలు హైదరాబాద్లోని ఒక కానిస్టేబుల్కు చేరాయి. సీసీ టీవీల నుంచి తీసిన ఈ ఫుటేజీలను ఆలయంలోని ఎస్పీఎఫ్ సిబ్బంది ఒకరు పంపినట్టు తెలుస్తోంది. బాధితురాలి కంప్లయింట్ప్రకారం..పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఓ మహిళ 2014లో హైదరాబాద్కు చెందిన మహమ్మద్అహ్మద్అనే కానిస్టేబుల్ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. అయితే, ఆమెను వేధింపులకు గురి చేయడంతో దూరమై నాగోల్లో ఉంటోంది. అతడు గోదావరిఖనికి ట్రాన్స్ఫర్అయ్యాక కూడా వేధించడం మానలేదు.
ALSO READ:కొంపముంచిన బ్యూటీపార్లర్ .. అయిల్ పెట్టగానే జుట్టు మొత్తం ఊడిపోయింది
ఈ క్రమంలో జూన్ 28న బాధితురాలు తన ఫ్రెండ్తో కలిసి దర్శనం కోసం గుట్టకు వచ్చింది. విషయం తెలుసుకున్న మహమ్మద్అహ్మద్ టెంపుల్ లో పని చేసే తన ఫ్రెండ్అయిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్కు విషయం చెప్పాడు. దీంతో అతడు ఆలయ ప్రాంగణంలో ఫ్రెండ్తో ఉన్న సదరు మహిళ ఫొటోలు, వీడియోల సీసీ ఫుటేజీలను పంపించాడు. వీటిని అతడు అందరికీ పంపిస్తూ విడాకులు ఇవ్వాలని సతాయిస్తున్నాడు. దీంతో సదరు మహిళ బుధవారం గుట్టకు వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మరోవైపు వీహెచ్పీ నేతలు కూడా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లయింట్ఇచ్చారు. దీనిపై ఇంతకుముందే గుట్ట ఈవోకు, రాచకొండ సీపీకి ఫిర్యాదు చేసింది.