వాళ్లిద్దరూ జట్టుకు మరో పదేళ్లు ఆడుతరు

వాళ్లిద్దరూ జట్టుకు మరో పదేళ్లు ఆడుతరు

ముంబై: యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రేవిస్ లను వేలంలో దక్కించుకున్న ముంబై ఇండియన్స్ చాలా తెలివైన నిర్ణయం తీసుకుందని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ జట్టుకు మరో పదేళ్ల పాటు సేవలందిస్తారని అన్నాడు. ‘తిలక్, బ్రేవిస్ ముంబై జట్టుకు మంచి పెట్టుబడి. ఈ ఇద్దరిని తీసుకుని మేనేజ్ మెంట్ సరైన నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్ల పాటు వీరు జట్టుకు ఎంతో ఉపయోగపడతారు. ఎంతో ప్రతిభ గల ఈ ప్లేయర్లు మరో పదేళ్ల పాటు ముంబై జెర్సీ ధరిస్తారన్న నమ్మకం ఉంది. వీరిద్దరూ  గొప్పగా ఆడుతున్నారు.  ఆరంభంలో మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే యువ ఆటగాళ్లు జట్టులో చోటును సుస్థిరం చేసుకుంటారు. ప్రస్తుతం తిలక్ అదే చేస్తున్నాడు’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. హర్భజన్‌‌ అభిప్రాయంతో ఏకీభవించిన మాజీ పేసర్‌‌ ఇర్ఫాన్‌‌ పఠాన్‌‌.. ఇదే జోరు కొనసాగిస్తే ముంబై జట్టుకు తిలక్ ఓ సూపర్ హీరోగా మారతాడన్నాడు.