ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు స్వీకరించనున్నాడు.  ఈ విషయాన్ని యాజమాన్యం ప్రకటించింది.  రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాకు  బాధ్యతలు అప్పగించింది మేనేజ్మెంట్. దీంతో ఐపీఎల్ 2024లో ముంబై జట్టును  పాండ్యా లీడ్ చేయనున్నాడు.   కెప్టెన్‌గా రోహిత్ జట్టుకు అద్బుతమైన సేవలను అందించాడని యాజమాన్యం కొనియాడింది. 

ఇప్పటివరకు   ముంబై జట్టుకు రోహిత్ 158 మ్యాచ్ లకు కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో 87 విజయాలు,  67 ఓటములున్నాయి. జట్టుకు రోహిత్ ఐదు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు.   గత రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను ఇటీవలే ముంబై జట్టులోకి తీసుకుంది. దీంతో అతడిని  ముంబై ఇండియన్స్ కు కెప్టెన్‌గా నియమిస్తారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.  

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించడంపై  క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ  వ్యక్తం చేస్తున్నారు.   మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకుని  జట్టును ఐదుసార్లు ఛాంఫియన్ గా నిలిపిన రోహిత్ శర్మరకు ఐపీఎల్ లో మరికొన్ని సీజన్స్  కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.  అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పినట్లుగా మేనేజ్మెంట్ చెబుతుంది.