గోదావరిఖని, వెలుగు: రామగుండం పవర్ ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యలకు నిరసనగా గోదావరిఖనిలోని మెయిన్చౌరస్తాలో ఆయన దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లీడర్లు మహంకాళి స్వామి, కోదండ రామాలయ చైర్మన్ గట్ల రమేశ్ మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రామగుండం ప్రాంతానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ తీసుకువస్తే కమీషన్ల కోసమేనంటూ హరీశ్రావు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో లీడర్లు బొంతల రాజేశ్, దీటి బాలరాజు, ఎల్లయ్య, ముస్తఫా, శ్రీను, వేణు, బాలరాజ్ కుమార్, శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, పాల్గొన్నారు. * హరీశ్రావును దూషిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడాన్ని ఖండిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ లీడర్లపై ఫిర్యాదు చేశారు.
