- వార్షికంగా 62 శాతం పెరుగుదల
- 27 శాతం పెరిగిన డిపాజిట్లు
న్యూఢిల్లీ : హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు గత డిసెంబర్తో ముగిసిన మూడో క్వార్టర్లో అడ్వాన్స్ల విలువ (ఇచ్చిన అప్పులు) రూ.24,69,500 కోట్లకు చేరింది. 2022 డిసెంబర్లో ముగిసిన మూడో క్వార్టర్లోని అడ్వాన్సులతో (రూ.15,20,500 కోట్లు)తో పోలిస్తే ఇవి 62.4శాతం ఎక్కువ. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, సెప్టెంబర్ 30, 2023 నాటికి బ్యాంక్ గ్రాస్ అడ్వాన్స్లు రూ.23,54,600 కోట్ల నుంచి 4.9శాతం పెరిగాయి. ఇంటర్-బ్యాంక్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు, బిల్లుల రీడిస్కౌంట్వసూళ్లు, బ్యాంక్ అడ్వాన్స్ల విలువ డిసెంబర్ 31, 2022 నాటికి దాదాపు 60.7శాతం, సెప్టెంబర్ 30, 2023 నాటికి దాదాపు 3.8శాతం పెరిగింది. దేశీయంగా రిటైల్ లోన్లు వార్షికంగా 111 శాతం పెరిగాయి.
సీక్వెన్షియల్గా దాదాపు 3.0శాతం పెరిగాయి. వాణిజ్య, గ్రామీణ బ్యాంకింగ్ లోన్లు 6.5శాతం పెరిగాయి. కార్పొరేట్, ఇతర టోకు లోన్లు సీక్వెన్షియల్గా రెండు శాతం పెరిగాయి. డిపాజిట్లు 1.9శాతం పెరిగి రూ.22,14,000 కోట్లకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2023 చివరి నాటికి వీటి విలువ రూ.21,72,900 కోట్లు ఉంది. డిపాజిట్లు సంవత్సరానికి 27.7శాతం వృద్ధి చెందాయి. సీక్వెన్షియల్గా రిటైల్ డిపాజిట్లు 2.9శాతం పెరగగా, టోకు డిపాజిట్లు 3.4శాతం క్షీణించాయి. బ్యాంక్ కాసా డిపాజిట్లు మూడో క్వార్టర్లో సుమారు రూ.8,35,500 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్ వృద్ధి 2.2శాతం శాతం ఉంది. రిటైల్ కాసా డిపాజిట్లు వార్షికంగా దాదాపు 10 శాతం పెరిగాయి. సీక్వెన్షియల్గా ఇవి 2.3శాతం పెరిగాయి. బ్యాంక్ కాసా నిష్పత్తి డిసెంబర్ 31, 2023 నాటికి 37.7శాతంగా ఉంది. డిసెంబర్ 31, 2022 నాటికి 44 శాతం, సెప్టెంబర్ 30, 2023 నాటికి 37.6శాతం ఉంది.