టెక్స్టైల్స్ పీఎల్ఐ పథకం.. దరఖాస్తులకు ఆమోదం.. మొత్తం రూ. 2,374 కోట్ల పెట్టుబడి

టెక్స్టైల్స్ పీఎల్ఐ పథకం.. దరఖాస్తులకు ఆమోదం.. మొత్తం రూ. 2,374 కోట్ల పెట్టుబడి

న్యూఢిల్లీ:  టెక్స్​టైల్స్ సెక్టార్​అభివృద్ధికి రూపొందించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్​ఐ) పథకం మూడో రౌండ్​లో 17 కొత్త దరఖాస్తుదారులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం మ్యాన్​-మేడ్​ ఫైబర్​ (ఎంఎంఎఫ్​) అపెరల్​, ఎంఎంఎఫ్​ ఫ్యాబ్రిక్స్​, టెక్నికల్​ టెక్స్​టైల్స్​ రంగాలలో పెట్టుబడులను వేగవంతం చేయనుంది. 

దేశీయ తయారీని పెంచడం, భారతదేశ ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడం ఈ స్కీమ్​ లక్ష్యం. కొత్తగా ఆమోదం పొందిన దరఖాస్తుదారులు మొత్తం రూ. 2,374 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 12,893 కోట్లకు పైగా విక్రయాలు సాధించవచ్చని, రాబోయే సంవత్సరాలలో సుమారు 22,646 మందికి ఉపాధి లభిస్తుందని కేంద్రం పేర్కొంది. ఎంఎంఎఫ్​ అపెరల్స్​, ఫ్యాబ్రిక్స్​, టెక్నికల్​ టెక్స్​టైల్స్​ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూ. 10,683 కోట్ల కేటాయింపుతో 2021 సెప్టెంబర్​ 24న ఈ పథకాన్ని నోటిఫై చేశారు.