తల్లిని చంపిన తండ్రి: కష్టాల్లో నలుగురు ఆడపిల్లలు

తల్లిని చంపిన తండ్రి: కష్టాల్లో నలుగురు ఆడపిల్లలు

నర్వ, వెలుగు: మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని నారాయణపేట జిల్లాలో భార్య గొంతుకు తాడు బిగించి చంపేశాడో భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. నర్వ మండలం పెద్దకడుమూర్​కి చెందిన మునెప్ప, శ్యామలమ్మ(36)భార్యాభర్తలు. వీరికి నలుగురు ఆడపిల్లలు. మద్యానికి బానిసైన మునెప్ప రెండేండ్లుగా ఖాళీగా ఉంటూ డైలీ లిక్కర్​ కోసం భార్యతో గొడవపడేవాడు. గురువారం తెల్లవారుజామున తాగేందుకు పైసలియ్యమని మరోసారి భార్యతో గొడవపడ్డాడు. ఇవ్వకపోయేసరికి తాడుతో శ్యామలమ్మ  గొంతు బిగించి చంపేశాడు. మృతురాలి అన్న గోవిందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ ​చేశారు. ఘటనా స్థలాన్ని మరికల్ సీఐ శివ కుమార్,  నర్వ ఎస్సై విజయ్ భాస్కర్ పరిశీలించారు.  మునెప్ప ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.