నిమజ్జన ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్​లు

నిమజ్జన ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు, అంబులెన్స్​లు
  • వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర​ రాజనర్సింహ

హైదరాబాద్, వెలుగు: గణేశ్​ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సత్వర వైద్యాన్ని అందించేందుకు డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. హైదరాబాద్ సిటీలో గణేశ్ నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో  ముందస్తుగా 30 చోట్ల హెల్త్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనం  వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం  అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్​కు లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.