- వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ
ములుగు, వెలుగు: ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ పక్కాగా సేకరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా హెల్త్ప్రొఫైల్చేపట్టారని, ఇందులో ములుగు ఒకటని అన్నారు. ములుగు కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్కృష్ణ ఆదిత్య, హెల్త్ డైరెక్టర్డాక్టర్శ్రీనివాసరావు, సీఎం ఆఫీస్ఓఎస్డీ డాక్టర్ గంగాధర్తదితరులతో కలిసి మెడికల్ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రతి మెడికల్ ఆఫీసర్ కు హెల్త్ప్రొఫైల్పై ట్రెయినింగ్ ఇవ్వాలని సూచించారు. హెల్త్ డైరెక్టర్డాక్టర్శ్రీనివాస్మాట్లాడుతూ గతంలో చికిత్స నిమిత్తం వచ్చిన వారి పేర్లు, సమస్యను రిజిష్టర్లలో నమోదు చేశామని, అదేపద్ధతిలో హెల్త్ ప్రొఫైల్ఉంటుందన్నారు. గ్రామంవారీగా ప్రతి ఒక్కరి హెల్త్కండీషన్, బ్లడ్గ్రూప్, టోటల్బాడీ చెకప్, షుగర్లెవల్స్, డయాలసిస్ తదితర సమస్యలతో బాధపడుతున్న వారి వివరాలను హెల్త్ప్రొఫైల్లో పొందుపరిస్తే మెడిసిన్స్అందుబాటులో ఉంచేందుకు ఉపయోగపడుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన 18 ఏళ్లు నిండిన యువతీ, యువకుల బరువు, ఎత్తు, జండర్, బీపీ, షుగర్, బ్లడ్గ్రూప్, హిమోగ్లోబిన్పరీక్షలు నిర్వహిస్తారని, వీటితోపాటు గుండె, లివర్తదితర వ్యాధుల వివరాలు కూడా సేకరిస్తారన్నారు. గతంలో ఉట్నూర్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి సక్సెస్అయ్యామని, ప్రస్తుత పరిస్థితిని బట్టి ప్రజల సౌకర్యార్థం వారి హెల్త్ ప్రొఫైల్తయారు చేసేందుకు ప్రత్యేకంగా ప్రోగ్రాం తయారు చేస్తున్నట్లు ఓఎస్డీ డాక్టర్ గంగాధర్చెప్పారు. ప్రతి మెడికల్ఆఫీసర్కి ట్రెయినింగ్ఇస్తామని, ఏఎన్ఎం, ఇద్దరు ఆశా కార్యకర్తలతో టీంగా ఏర్పాటు చేస్తామన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ అల్లెం అప్పయ్య మాట్లాడుతూ జిల్లాలో 153 టీంలు ఏర్పాటు చేసి ఒక్కో టీంలో ఏఎన్ఎం, హెల్త్అసిస్టెంట్, ఇద్దరు ఆశా కార్యకర్తలతో పని చేస్తామన్నారు. 18 ఏళ్లు నిండినవారు జిల్లాలో 2,60,620 మంది ఉన్నారని వివరించారు.