భారీగా తగ్గిన ఆదిపురుష్ టికెట్ రేట్స్.. కేవలం రూ. 112 మాత్రమే

భారీగా తగ్గిన ఆదిపురుష్ టికెట్ రేట్స్.. కేవలం రూ. 112 మాత్రమే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన ఆదిపురుష్(Adipurush) మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు  వచ్చింది. అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచి నెగటివ్ టాక్ రావడంతో ఆశించన ఫలితం అందుకోలేకపోయింది. అంతేకాదు సినిమా పై వస్తున్న విమర్శలు కారణంగా కలెక్షన్లపై ప్రభావం పడింది. రోజురోజుకూ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోతున్నాయి.

దాంతో ఆదిపురుష్ సినిమా టికెట్ల ధరను తగ్గిస్తూ చిత్ర నిర్మాతలు కీళిక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 26 నుండి 3డిలో ఈ సినిమాను కేవలం 112 రూపాయలకే చూడవచ్చని టీ సిరీస్ ప్రకటించింది. అంతేకాదు.. సినిమాలోని అభ్యంతరకర డైలాగ్స్‌ కూడా మార్చినట్టు కూడా టీ సిరీస్ సంస్థ వెల్లడించింది. ఇలా అయినా సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వస్తారని టీమ్ ఆశిస్తున్నట్లు సమాచారం. మరి ఈ నిర్ణయంతో ఐనా  ఆదిపురుష్ కలెక్షన్స్ పెరుగుతాయా అనేది చూడాలి.