
నిర్మల్, వెలుగు : బాసర, మహబూబ్నగర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు గట్టి పోటీ నెలకొంది. బాసర మెయిన్ క్యాంపస్లో 1,500 సీట్లతో పాటు మహబూబ్నగర్ క్యాంపస్లో 180 కలిపి మొత్తం 1,680 సీట్లు ఉన్నాయి.
ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు మే 31న నోటిఫికేషన్ జారీ చేయగా... అప్లికేషన్కు ఈ నెల 21తో గడువు ముగిసింది. చివరి తేదీ లోగా మొత్తం 20,258 మంది స్టూడెంట్లు అప్లై చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఐదు వేల అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయి. ఈ నెల 26, 27 తేదీల్లో స్పెషల్ కేటగిరి క్యాండిడేట్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి వచ్చే నెల 4 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ చెప్పారు.