కుండపోత వర్షాలు... వీడియో కాన్ఫరెన్స్ లో పెండ్లి

కుండపోత వర్షాలు... వీడియో కాన్ఫరెన్స్ లో పెండ్లి

సిమ్లా: కుండపోత వర్షాలు పెండ్లికి అడ్డంకిగా మారడంతో హిమాచల్ ప్రదేశ్ లో ఓ జంట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుకున్న ముహూర్తానికే పెండ్లి చేసుకుంది. షిమ్లా జిల్లాలోని కోట్ గఢ్ కు చెందిన ఆశిష్ సింఘాకు, కులూ జిల్లా భుంతార్ కు చెందిన శివానీ ఠాకూర్ కు పెద్దలు పెండ్లి నిశ్చయించారు. పెండ్లి కోసం సోమవారం పెండ్లి కొడుకు, అతడి చుట్టాలు భుంతార్ కు బయలుదేరాల్సి ఉంది. కానీ వర్షాల రూపంలో అనుకోని విపత్తు వచ్చింది. వర్షాలు, వరదలు, ల్యాండ్ స్లైడ్స్ కారణంగా రోడ్లు బ్లాక్ అయ్యాయి. పెండ్లి కొడుకు, అతడి చుట్టాలు పెండ్లి కూతురు ఊరికి వెళ్లే అవకాశం లేకుండాపోయింది. దీంతో ఎలాగైనా అనుకున్న ముహూర్తానికే పెండ్లి జరిపించాలని రెండు వైపుల పెద్దలు నిర్ణయించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్ లైన్ వెడ్డింగ్ నిర్వహించారు.