ప్రేక్షకులు మెచ్చే ద్రోహి

ప్రేక్షకులు మెచ్చే ద్రోహి

సందీప్‌‌కుమార్‌‌, డెబా డాలీ జంటగా విజయ్‌‌ పెందుర్తి దర్శకత్వం వహించిన చిత్రం ‘ద్రోహి’.  ద క్రిమినల్‌‌ ట్యాగ్‌‌లైన్‌‌తో విజయ్‌‌ పెందుర్తి, శ్రీకాంత్ రెడ్డి  నిర్మించారు. అక్టోబర్ 13న సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆరోజు నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్సుల్లో రూ.112లకే టికెట్ లభించనుందని తెలియజేసింది టీమ్. ఆదివారం ఈ మూవీ టీజర్‌‌‌‌ను హీరో త్రిగుణ్ రిలీజ్ చేసి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

సందీప్ మాట్లాడుతూ ‘ద్రోహి టైటిల్‌‌కు బాగా కనెక్ట్ అయ్యాం. ఇది క్రైమ్ థ్రిల్లర్ అనుకుంటున్నారు. కానీ ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని  చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది  డెబా డాలీ. విజయ్ మాట్లాడుతూ ‘ఓ పెద్ద సినిమా పాటకు, ప్రమోషన్‌‌కు ఖర్చుపెట్టే బడ్జెట్‌‌తో మా సినిమా తీశాం.  అద్భుతం తీశానని చెప్పను కానీ ప్రేక్షకులు మెచ్చే అంశాలున్నాయని మాత్రం చెప్పగలను’ అని అన్నారు.