
వెంకటేష్ హీరోగా నటిస్తున్న 75వ సినిమా ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ శ్రీలంకలో జరుగుతోందని తెలియజేశారు మేకర్స్. ఈ షెడ్యూల్లో బ్యాలెన్స్ టాకీ పార్ట్, ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్లతో పాటు ఒక పాట కోసం కొన్ని మాంటేజ్ సీన్స్ షూట్ చేయనున్నారు.
వెంకటేష్తో పాటు కీలక పాత్రధారులంతా షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇందులో వెంకటేష్ ఫెరోషియస్ లుక్లో కనిపించనున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్గా నటిస్తుంటే, ఆర్య మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది.