డ్రగ్స్ ఒక్కసారి ట్రై చేయమనే బ్యాచ్ ఉంటది.. వాళ్లకి దూరంగా ఉంటే సేఫ్ : విజయ్ దేవరకొండ

డ్రగ్స్ ఒక్కసారి ట్రై చేయమనే బ్యాచ్ ఉంటది.. వాళ్లకి దూరంగా ఉంటే సేఫ్ : విజయ్ దేవరకొండ

మన చుట్టూ డ్రగ్స్ ఒక్కసారి ట్రై చేయమనే బ్యాచ్ ఉంటుందని.. వాళ్ల ఒత్తిడితో ఒక్కసారి అలవాటైతే  బయటకి రాలేమని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. అలాటి వాళ్లకు దూరంగా ఉంటే మంచిదని అన్నారు.  యాంటీ  నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన ఇంటర్నేషన్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ కార్యక్రమంలో మాట్లాడారు విజయ్. ఈ సందర్భంగా.. యూత్ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని అన్నారు. సక్సెస్, మనీ, రెస్పెక్ట్.. ఇవ్వకపోతే అలాంటి దాంట్లోకి దిగటమే వేస్ట్ అని చెప్పారు. 

తనకు పోలీస్ ఆఫీసర్లు చెప్పే వరకు డ్రగ్స్ గురించి రియాలిటీ తెలియదని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అన్నారు. తమను ఎంతో మంది అభిమానిస్తుంటారని.. అలాంటి వారి మంచి కోరి నాలుగు మాటలు చెప్పాలని ఈ కార్యక్రమానికి వచ్చినట్లు చెప్పారు. అందరికీ హెల్త్ ముఖ్యం..మనం చేసే పనితో  అమ్మా నాన్న గర్వంగా ఉండాలి.. యూత్ అలా ఆలోచించాలని అన్నారు. 

యంగ్ ఏజ్ లో చాలా కేర్ ఫుల్ గా ఉండాలని హెచ్చరించారు విజయ్. మన కంట్రీ పవర్.. స్టేట్ పవర్ మన  యూత్ అని.. యూత్ ను పాడు చేస్తే కంట్రీని నాశనం చేయవచ్చని ఇండియాలోకి డ్రగ్స్ పంపుతున్నారని అన్నారు. రాష్ట్ర లో డ్రగ్స్ పెరగకుండా ఉండటానికి ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూల పై అవగాహన పెంచాల్సి అవసరం ఉందన్నారు. అందరం రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. 

లైఫ్ లో సక్సెస్ కావాలంటే మన లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలి.. రెస్పెక్ట్ ఇవ్వని డ్రగ్స్ జోలికి వెళ్ల  కూడదని అన్నారు. ఇండియా నంబర్ వన్ గా ఉండాలంటే యువత,  ఇండియన్స్ డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని.. చెడు అలవాటు కు బానిస కావద్దని పిలుపునిచ్చారు. ఎక్సర్సైజ్ చేయండి.. హెల్త్ గా ఉండండి.. సక్సెస్ చేజ్ చేయండి అని యూత్ కు సలహా ఇచ్చాడు హీరో విజయ్ దేవరకొండ. 

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   సినీ నటులు రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజ్,  ఎమ్మెల్యే అరికెపూడి  గాంధీ, చేవెళ్ల బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.