చెన్నయ్: రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని హీరో విశాల్కు మద్రాస్ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. నటుడు విశాల్ తమ వద్ద రూ.21.69 కోట్లు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడంలేదంటూ లైకా ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి... మూడు వారల్లోగా హైకోర్ట్ ప్రధాన రిజిస్ట్రార్ పేరున వడ్డీతో సహా మొత్తం డబ్బును డిపాజిట్ చేయాలని విశాల్ ను ఆదేశించారు. మరుసటి విచారణను 22వ తేదీకి వాయిదా వేశారు.
మరిన్ని వార్తల కోసం