
గతేడాది ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే.. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. తన నుంచి రాబోతున్న చిత్రాల్లో ‘కింగ్డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ ఫిమేల్ లీడ్గా నటించింది. తాజాగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ను శుక్రవారం కంప్లీట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
బ్రదర్ సెంటిమెంట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ నెల 31న వరల్డ్వైడ్గా సినిమా విడుదల కానుంది. తెలుగులో ‘కింగ్డమ్’గా రిలీజ్ అవుతుండగా, హిందీలో ‘సామ్రాజ్య’ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.