
రామ్ చరణ్, జాన్వీకపూర్ జంటగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన జాన్వీకపూర్.. ఇలా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఏఎంబీ థియేటర్లో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వారంలో రామ్ చరణ్, జాన్వీ జంటపై ఓ పాటతో పాటు లవ్ సీన్స్ చిత్రీకరించబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.