ఇవన్నీ చూస్తుంటే భయమేస్తోంది.. రష్మిక వీడియోపై కీర్తి కామెంట్స్

ఇవన్నీ చూస్తుంటే భయమేస్తోంది.. రష్మిక వీడియోపై కీర్తి కామెంట్స్

గత రెండురోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రష్మిక మందన్నా(Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో(Deep fake video) గురించే చర్చ నడుస్తోంది. జరా పటేల్(Zara petal) కు సంబందించిన ఒక వీడియోకి రష్మిక పేస్ ను యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆకతాయిలు. ఆ వీడియో కాస్త అసభ్యంగా ఉండటంతో వీడియో వైరల్ గా మారింది.

చాలా మంది స్టార్ సెలబ్రెటీలు ఈ వీడియోపై మండిపడ్డారు. ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో అమితాబ్ బచ్చన్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ..ఇలా చాలా మందే ఉన్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించారు స్టార్ హీరోజునే కీర్తి సురేష్.. ఈ డీప్ ఫేక్ వీడియోలు చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఆ వీడియో చేసిన వ్యక్తిని నేను కోరుకునేది ఒక్కటే. ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా చేస్తే బాగుటుంది. పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మనకు వరమా? శాపమా? అర్థం కావడంలేదు. సాంతికేతికను పాజిటివిటీ పెంచేందుకు ఉపయోగించండి. ఇలాంటి నాన్ సెన్స్ వద్దు. మనవజాతిని ఆ దేవుడే  కాపాడాలి.. అంటూ రాసుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం కీర్తి షేర్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తమిళంలో సైరన్, రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.