క‌స్ట‌డియ‌ల్ డెత్ పై ఎంక్వ‌యిరీ క‌మిష‌న్ ను నియ‌మించిన హైకోర్టు‌

క‌స్ట‌డియ‌ల్ డెత్ పై ఎంక్వ‌యిరీ క‌మిష‌న్ ను నియ‌మించిన హైకోర్టు‌

పెద్దపల్లి జిల్లా మంథని పోలీసు స్టేషన్‌లో మంగ‌ళ‌వారం రంగయ్య అనే వ్యక్తి క‌స్ట‌డియ‌ల్ డెత్  కు గురైన ఘ‌ట‌నపై హైకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. క‌స్ట‌డియ‌ల్ డెత్ ఘటన పై న్యాయవాది నాగమణి హైకోర్టుకు లేఖ రాయడంతో. . ఆ లేఖ ను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.

క‌స్ట‌డియ‌ల్ డెత్  పై ఎంక్వైరీ కమిషన్ ను ఆదేశించిన హైకోర్టు… ఎంక్వయిరీ కమిషన్ అధికారిగా హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ ని నియమించింది. జాన్ 2 వరకు క‌స్ట‌డియ‌ల్ డెత్  పై సమగ్ర నివేదిక అందించాలని ఎంక్వయిరీ కమిషన్ కు ఆదేశ‌మిస్తూ.. తదుపరి విచారణను జూన్ 2 కు వాయిదా వేసింది.

వన్య ప్రాణులను వేటాడుతున్నడ‌న్న స‌మాచారంతో రామ‌గిరి మండలం రామయ్య పల్లి గ్రామానికి చెందిన రంగయ్య అనే వ్య‌క్తితో పాటు మరో నలుగురిని పోలీసులు మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ క్ర‌మంలో స్టేష‌న్ లోనే రంగ‌య్య‌ ఆత్మహత్య చేసుకున్నాడు. క‌స్ట‌డియ‌ల్ డెత్ కావ‌డంతో కోర్టుకు లేఖ రాయ‌గా బుధ‌వారం విచార‌ణ చేసింది.