కామారెడ్డి, వెలుగు: దోమకొండ మండలం ముత్యంపేట ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని ఆక్రమించి ప్రైవేట్ వ్యక్తులు కడుతున్న రూమ్లను హైకోర్టు ఆదేశాలతో గురువారం కూల్చివేశారు. గతంలో ఉప సర్పంచ్గా పని చేసిన శిరీష్గౌడ్ కుటుంబసభ్యులు రూమ్స్ నిర్మిస్తున్నారు.
దీనిపై స్థానికులు హైకోర్టుకు వెళ్లడంతో వాటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కోర్టు ఆదేశాలతో అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కట్టడాలు కూల్చివేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
