- నాంపల్లి బజార్ఘాట్ అగ్ని ప్రమాదం కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు : నాంపల్లి బజార్ఘాట్ అగ్ని ప్రమాదం కేసులో బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
నాంపల్లి బజార్ ఘాట్లోని బాలాజీ రెసిడెన్సీ కింద రసాయన డ్రమ్ములు, ఇతర ముడిసరుకు నిల్వ చేసి ఉండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గత నెల 13న అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.
అనంతరం బిల్డింగ్ఓనర్ రమేశ్ జైస్వాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖను హైకోర్టు పిల్గా తీసుకుంది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్తో కూడిన బెంచ్సోమవారం విచారణ చేపట్టింది.
బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, అగ్నిమాపకశాఖ డీజీ, జీహెచ్ఎంసీ, సిటీ పోలీస్ కమిషనర్, కలెక్టర్, నాంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది.