బోయినిపల్లి, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ పంచాయతీ సర్పంచ్ రిజర్వేషన్పై సోమవారం హైకోర్టులో విచారణ కొనసాగింది. గ్రామానికి చెందిన కత్తెరపాక సుధాకర్రిజర్వేషన్పై హైకోర్టులో రిట్పిటిషన్ దాఖలు చేశారు. వరుసగా రెండుసార్లు మహిళా రిజర్వేషన్ రావడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ పిటిషన్ వేశారు. పిటిషనర్తరఫున అడ్వకేట్ తీగల రాంప్రసాద్తన వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో జనరల్ మహిళకు రిజర్వేషన్ కాగా, ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వేషన్కు కావడం, జీవో నంబర్ 46 రూల్ 4 (3) కి విరుద్ధమన్నారు. రిజర్వేషన్రొటేషన్విధానాన్ని పాటించకుండా గెజిట్ మార్చడం అన్యాయమని కోర్టుకు వివరించారు. ప్రభుత్వం తరుపున స్పెషల్గవర్నమెంట్అడ్వకేట్రాహుల్రెడ్డి సమాధానమిస్తూ మండలంలోని 23 గ్రామాల్లో మహిళా రిజర్వేషన్50 శాతం నిబంధన నెరవేర్చేందుకు 11 గ్రామాలకు మహిళా రిజర్వేషన్ కేటాయించాల్సి వచ్చిందని, అందులో కొదురుపాక ఒకటని పేర్కొన్నారు.
