
హైదరాబాద్, వెలుగు: శేరిలింగంపల్లి పరిధి రాయదుర్గంలోని పబ్లో సౌండ్కంట్రోలింగ్ చేపట్టకపోవడంపై శుక్రవారం ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న పబ్లపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. రెడ్ రైనో పబ్, పోస్ట్కార్డ్ రెస్టారెంట్అండ్ గ్లోబల్ తపస్ బార్ నుంచి విపరీతమైన శబ్దం వస్తోందని, దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ డి.ఆనంద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే, జస్టిస్ జె. శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పబ్ల ద్వారా వచ్చే శబ్ద కాలుష్యంతో తమ కాంప్లెక్స్లో ఎవరూ అద్దెకు ఉండటంలేదని తెలిపారు. పరిమితికి మించి శబ్దం సృష్టిస్తున్నాయన్నారు. అనుమతులను ఉల్లంఘిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలేదని, లైసెన్సులను రద్దు చేసేలా ఆదేశించాలని కోరారు. ప్రతివాదులైన వివిధ ప్రభుత్వ శాఖలు, పబ్ల యజమానులకు నోటీసులు జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.