నిజామాబాద్ జిల్లా ఎరగట్ల మండలం బట్టాపూర్ క్వారీని మూసివేయాలని హై కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్వారీ అనుమతులు ముగిసినా అక్రమంగా కొనసాగిస్తున్నారని.. కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు..క్వారీని సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ సెక్రెటరీలు, పలువురు ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. క్వారీ మూసివేత ఆదేశాలతో క్వారీ సమీప గ్రామాల్లో సంబరాలు నెలకొన్నాయి.
