సీఎం సభకు అడ్డంకులు తొలగినట్లేనా?

సీఎం సభకు అడ్డంకులు తొలగినట్లేనా?

హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న  సీఎం కేసీఆర్ హాలియా సభను అడ్డుకోవాలన్న పిటిషన్ ల విచారణకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. ఉప ఎన్నిక జరగనున్న నాగార్జున సాగర్ స్వతంత్ర అభ్యర్ధి సైదయ్యతోపాటు సభ నిర్వహించే భూముల రైతులు పలు పిటిషన్లు వేశారు. వీటి విచారణకు అత్యున్నత ధర్మాసనం నో చెప్పింది. రోస్టర్ ఉన్న బెంచ్ కు ఈ కేసులు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు సెలవులు కావడంతో 14న జరగనున్న కేసీఆర్ సభకు ఉన్న అడ్డంకులు తొలిగినట్లేనని తెలుస్తోంది.