
- 8 మందికి గాయాలు.. అమెరికాలో ఘటన
సౌత్పోర్ట్(అమెరికా): అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. నార్త్ కరోలినా రాష్ట్రంలోని సౌత్పోర్ట్ సిటీలో కేప్ ఫియర్ నది తీర ప్రాంతంలో ఉన్న ఓ బార్పై దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు మృతిచెందగా మరో 8 మంది గాయపడ్డారు.
ఈ ఘటన శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో జరిగింది. బోట్లో వచ్చిన వ్యక్తి.. అమెరికన్ ఫిష్ కంపెనీకి చెందిన ఔట్డోర్ బార్పై కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు. సౌత్పోర్ట్ వాటర్ ఫ్రంట్లోని బార్లు, రెస్టారెంట్ల సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వెంటనే యూఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పాట్కు చేరుకొని పరిశీలించారు. దుండగుడు ఒడ్డుకు దగ్గరగా వచ్చి.. జనంపై కాల్పులు జరిపి.. అనంతరం అదే పడవలో ఇంట్రాకోస్టల్ వాటర్వే వైపు పారిపోయాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
సుమారు అరగంట సెర్చ్ఆపరేషన్ తర్వాత.. యూఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది ఓ అనుమానితుడి ఓక్ ద్వీపంలోని పబ్లిక్ రాంప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.