న్యూఢిల్లీ: పైపులు, ఫిట్టింగ్ల బ్రాండ్ అయిన క్రెస్టియా పాలిటెక్ టాప్లైన్ను, దాని పూర్తి యాజమాన్యంలోని నాలుగు అనుబంధ సంస్థలను రూ.265 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు హెచ్ఐఎల్ ప్రకటించింది. సీకే గ్రూప్లో హెచ్ఐఎల్ భాగం. క్రెస్టియా పాలిటెక్ దాని అనుబంధ సంస్థలు పైపులు, ఫిట్టింగ్లు, వాటర్ ట్యాంక్ సెక్టార్ వ్యాపారంలో ఉన్నాయి.
టాప్లైన్, రాక్వెల్, సోనిప్లాస్ట్ పేరుతో ఇవి ప్రొడక్టులను అమ్ముతాయి. 2026 నాటికి ఈ కేటగిరీని ఐదు రెట్లు విస్తరిస్తామని హెచ్ఐఎల్ చైర్పర్సన్ అవంతి బిర్లా అన్నారు. క్రెస్టియా పాలిటెక్ను దక్కించుకోవడం వల్ల అధిక-సాంద్రత కలిగిన పాలిథిలిన్, మీడియం డెన్సిటీ పాలిథిలిన్ కలిగిన వాటర్ ట్యాంక్ల వంటి పెద్ద విభాగాల్లోకి ప్రవేశించడానికి వీలవుతుందని హెచ్ఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అక్షత్ సేథ్ అన్నారు. ----
