కల్కా-సిమ్లా మధ్య ప్రారంభం
చండీగఢ్: నేచర్ లవర్స్కోసం రైల్వే శాఖ మరో కొత్త సర్వీసును ప్రారంభించింది. హర్యానాలోని కల్కా స్టేషన్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లా వరకు ‘హిమ దర్శన్’ రైలును బుధవారం టూరిస్టులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కిటికీలతో పాటు రూఫ్పైనా గ్లాస్ ఫిట్టింగ్చేసిన ఏడు కోచ్లతో ఈ ట్రైన్ను నడిపిస్తోంది. ఈ ఏడాది మొదట్లో ఈ రూట్లో ఒక విస్టాడోమ్ కోచ్ను నడిపించగా.. విపరీతమైన డిమాండ్ రావడంతో ఈ ట్రైన్ను ప్రారంభించినట్లు రైల్వే అధికారులు చెప్పారు. ట్రైన్ మొత్తం ఎరుపు రంగుతో, సెంట్రలైజ్డ్ ఏసీతో తీర్చిదిద్దారు.
సర్వీ సు ప్రారంభోత్సవం సందర్భంగా కోచ్లను రంగురంగుల బెలూన్లతో అలంకరించారు. కల్కా స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు ఈ ట్రైన్ బయలుదేరింది. బయట కురిసే మంచును చూస్తూ ఈ ట్రైన్లో ప్రయాణించడం ద్వారా ఓ సరికొత్త అనుభూతిని పొందొచ్చని రైల్వే అధికారులు చెప్పారు. కొత్తగా ప్రారంభించడం, న్యూఇయర్దగ్గర్లోనే ఉండడంతో చాలామంది ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు ఇప్పటికే బుకింగ్స్ చేసుకున్నారని వివరించారు.
విశేషాలు..
ఎరుపు రంగులో ఉన్న ఏడు ఏసీ కోచ్లు
వందమందికి పైగా ప్రయాణించే వీలు
ఈ రైలు ప్రయాణించే దూరం 95.5 కి.మి.