పాకిస్తాన్ లో హిందూ పెళ్లి కూతురు కిడ్నాప్

పాకిస్తాన్ లో హిందూ పెళ్లి కూతురు కిడ్నాప్

పాకిస్థాన్‌లో ఓ హిందూ వివాహం జరుగుతుండగా.. 24 ఏళ్ల వధువును కిడ్నాప్ చేశారు దుండగులు. ఆమెను మతం మార్చి బలవంతంగా ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారు. సింధ్ ప్రావిన్స్‌లోని హలా పట్టణంలో గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరిరామ్ కిశోర్ అధికారుల నుంచి నివేదిక కోరారు. మరోవైపు, భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టిసారించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు చెందిన సీనియర్ ఉద్యోగిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. కిడ్నాపైన యువతి గతేడాది డిసెంబరులో బనోరీ పట్టణంలో ఇస్లాం మతం స్వీకరించిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.