ముంబై:రిలయన్స్ క్యాపిటల్ను చేజిక్కించుకోవాలనుకుంటున్న హిందుజా గ్రూప్ అందుకవసరమైన ఫండ్స్లో కొంత అప్పుగా సమకూర్చుకోవాలని ప్రయత్ని స్తోంది. హిందుజా గ్రూప్ 800 మిలియన్ డాలర్ల ఫండ్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు అనిల్ అంబానీ నడిపిన రిలయన్స్ క్యాపిటల్ను దక్కించుకోవడానికి హిందుజా గ్రూప్ పోటీ పడుతోంది.
రిలయన్స్ క్యాపిటల్ను 2021 లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఆధీనంలోకి తీసుకుంది. కొన్నేళ్లలోనే అయిదు పెద్ద నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు డిఫాల్ట్ కావడంతో ఆర్బీఐ ఆ చర్య తీసుకుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ మొదలు రియల్ ఎస్టేట్, కెమికల్స్ వంటి రంగాలలో హిందుజా గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
రిలయన్స్ క్యాపిటల్ను కొనడం కోసం గ్రూప్లోని కంపెనీల నుంచి బిలియన్ డాలర్ల దాకా నిధులు సమకూర్చుకోవాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీనికి హిందుజా గ్రూప్ స్పందించలేదు.