రోడ్డు మీదకు వచ్చిన.. జింకను కారుతో ఢీ కొట్టిండు

 రోడ్డు మీదకు వచ్చిన..   జింకను కారుతో ఢీ కొట్టిండు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్ర శివారులో ఎస్సారెస్పీ వరద కాలువ వద్ద దారి తప్పి రోడ్డు మీదకి వచ్చిన జింకను కారు ఢీ కొట్టింది.  ఈ ఘటనలో జింక అక్కడిక్కడే  మృతి చెందింది.  అనుప మధు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జింకను కారుతో  ఢీ కొట్టాడు.  ఈ విషయం అటవీశాఖ అధికారులకు  తెలియడంతో సంఘటన స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించి  మధుపై కేసు నమోదు చేశారు.  జింకను పోస్టుమార్టం చేశారు కథలాపూర్ పశువైద్య అధికారి.