హైదరాబాద్, వెలుగు: బీ2బీ ఎగ్జిబిషన్స్ నిర్వహణ సంస్థ ఇన్ఫార్మా మార్కెట్స్ హైదరాబాద్ జ్యువెలరీ, పెర్ల్, జెమ్ ఫెయిర్ (హెచ్జెఎఫ్) 15వ ఎడిషన్ను నగరంలోని నోవాటెల్లో ప్రారంభించింది. ఈ సంవత్సరపు ప్రదర్శనలో దాదాపు 200 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ వినూత్న డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. దాదాపు 8000 మంది వాణిజ్య కొనుగోలుదారులు వచ్చారు.
600 ఎక్స్క్లూజివ్ బ్రాండ్లు ఈ ఎక్స్పో లో దాదాపు ఒక లక్షకు పైగా తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, వాణిజ్య,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ బులియన్, జెమ్ అండ్ జ్యువెలరీ ఫెడరేషన్ అధ్యక్షుడు జగదీశ్ పెర్షాద్ వర్మ, ఐబీజెఏ జాతీయ ఉపాధ్యక్షుడు చేతన్ మెహతా పాల్గొన్నారు.
