
హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఉద్యానవన శాఖ నిర్వహించే గార్డెన్ ఫెస్టివల్లో హెచ్ఎండీఏ ఏకంగా 25 అవార్డులు గెలుచుకుంది. ఏడో గార్డెన్ ఫెస్టివల్ నేపథ్యంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. హెచ్ఎండీఏ పార్కులు ఈ అవార్డులకు ఎంపిక కావడంపై అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్తో పాటు సిబ్బందికి మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ అభినందనలు తెలిపారు. సీఎం క్యాంప్ ఆఫీస్, రాజ్భవన్, ట్యాంక్బండ్ ల్యాండ్స్కేప్స్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, డాక్టర్ జీఎస్కే మెల్కోటే పార్కు(నారాయణగూడ), రాజీవ్గాంధీ పార్కు (వనస్థలిపురం), ఇందిరాగాంధీ రోటరీ, రాక్గార్డెన్, బుల్రోటరీ(నానక్ రాంగూడ), రోటరీ హెచ్జీసీఎల్ఆఫీస్(నానక్రాంగూడ), రెయిన్గార్డెన్( బేగంపేట్), క్రిమిటోరియం(ఫతుల్లాగూడ) ఫస్ట్ప్రైజ్లు గెలుచుకున్నాయి.
శాస్త్రీపురం పార్కు, బాపూఘాట్(లంగర్ హౌస్), సంజీవయ్య సమాధి, పీవీ సమాధి, ఎన్టీఆర్ మెమోరియల్, రోస్గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, వరంగల్హైవే, ఓఆర్ఆర్ మేయిడేన్, రోటరీ–బొంగులూరు ఇంటర్ చేంజ్, పటేల్కుంట పార్క్(కూకట్పల్లి), లేక్వ్యూ పార్క్ సెకండ్ప్రైజ్కు ఎంపికయ్యాయి. శనివారం సాయంత్రం పబ్లిక్ గార్డెన్ సెంట్రల్ లాన్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది.