
- ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, పచ్చదనం పెంపుకు హెచ్ఎండీఏ నిర్ణయం
- జూపార్క్, నిమ్స్ ఆవరణలో పైలట్ ప్రాజెక్టు
హైదరాబాద్సిటీ,వెలుగు: గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో గ్రీనరీని అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ప్లాన్లు రూపొందించింది. గ్రేటర్పరిధిలో పచ్చదనం తగ్గిపోతుందని వార్తలు వస్తుండడంతో అన్ని ముఖ్యమైన ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో ల్యాండ్స్కేప్ గార్డెనింగ్ను డెవలప్చేయడంతో పాటు రక రకాల మొక్కలు,చెట్లను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏలోని అర్బన్ఫారెస్ట్రీ విభాగం వివిధ ప్రభుత్వ ఆఫీసుల ప్రాంగణాల్లో పచ్చదనం కోసం పలు కార్యక్రమాలు చేపట్టబోతోంది.
జూపార్క్, నిమ్స్లో...
ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో నెహ్రూ జూలాజికల్ పార్క్ లో 1.97 కోట్లతో , పంజాగుట్టలోని నిమ్స్దవాఖాన ప్రాంగణంలో రూ.3.48 కోట్లతో పెద్దఎత్తున ల్యాండ్స్కేప్గార్డెన్ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూ పార్కుకు రోజూ వేల మంది సందర్శకులు వస్తుంటారు. దాదాపు 300 ఎకరాల్లో ఉన్న జూపార్క్ను టూరిజం పరంగా కూడా మరింత అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ముందుగా ల్యాండ్స్కేప్ను డెవలప్ చేయనున్నారు.
అలాగే, మెడికల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలోని నిమ్స్కు ప్రతి రోజూ వేలాది మంది రోగుల వారి బంధువులు వస్తుంటారు. ఇక్కడ వీరు సేదతీరేందుకు స్థలం లేదు. దీంతో వీరికి ఆహ్లాదకరంగా ఉండేలా ల్యాండ్ స్కేపింగ్గార్డెన్ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ రెండు ప్రాజెక్టులు సక్సెస్ అయితే మరికొన్ని ప్రభుత్వ విభాగాల ప్రాంగణాల్లోనూ ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టులు చేపట్టేందుకు హెచ్ఎండీఏ సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.