వర్షాల కోసం హోమాలు చేస్తున్న కర్ణాటక సర్కార్

వర్షాల కోసం హోమాలు చేస్తున్న కర్ణాటక సర్కార్

కర్ణాటకలో వర్షాల కోసం పూజలు జరుగుతున్నాయి. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాలయాలన్నింటికి ఆదేశాలిచ్చింది. శృంగేరీ ఆలయంలో రాష్ట్ర మంత్రి D K శివకుమార్ ప్రజన్య హోమంలో పాల్గొన్నారు. బెల్గామ్ లోని సవదట్టి ఎల్లమ్మ ఆలయంలో హోమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని ఆలయాల్లోనూ యజ్ఞ-యగాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. గత రెండు సంవత్సరాలు కర్ణాటకలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి కూడా అదే జరిగితే రాష్ట్రం పరిస్థితి దారుణంగా తయారవుతుందనే ఆందోళన కనబడుతోంది.