మృత్యువుతో పోరాడి.. హోంగార్డ్ రవీందర్ మృతి

మృత్యువుతో పోరాడి..  హోంగార్డ్ రవీందర్ మృతి

జీతాల ఆలస్యం, పోలీసుల వేధింపులతో ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డ్‌‌‌‌ రవీందర్‌‌‌‌  మృతి చెందారు.  డీఆర్ డీవో అపోలోలో చికిత్స పొందుతూ 2023 సెప్టెంబర్ 08 శుక్రవారం ఉదయం కన్నుమూశారు.  రవీందర్‌‌‌‌  చనిపోయినట్లుగా ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.  ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.   మూడు రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు రవీందర్. 

 కాగా, పాతబస్తీ రక్షకాపురానికి చెందిన రవీందర్.. 15 ఏండ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు.అయితే ప్రభుత్వం హోంగార్డులను రెగ్యులరైజ్ చేయడం లేదని, జీతాలు చెల్లించడం లేదని రవీందర్ ​మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం గోషామహల్ కమాండెంట్ ఆఫీసు కు వెళ్లి అడిగాడు. అక్కడి అధికారులు అవమానించడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.