చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయాందోళనల్లోకి నెట్టేసిన ప్రాణాంతక కరోనాకు హోమియోపతి, యునాని మందులు బాగా పనిచేస్తాయని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. బుధవారం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సీసీఆర్హెచ్) సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు సమావేశం తర్వాత ఆయుష్ ఈ ప్రకటన చేసింది. హోమియోపతి మందులతో కరోనా ఇన్ఫెక్షన్లు తగ్గించే విధానాలపై చర్చించింది. ఆర్సినికం ఆల్బమ్ 30 అనే మందు కరోనాపై బాగా పనిచేస్తుందని, పరగడుపుతో మూడు రోజుల పాటు తీసుకుంటే కరోనా వైరస్ సోకకుండా నియంత్రించవచ్చని తెలిపింది. మరో నెల తర్వాత సేమ్ డోస్ను తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయని చెప్పింది. కొన్ని ఆయుర్వేదిక్ మందులు, యునాని డికాక్షన్లు, ఇంటి ఔషధాలూ మెరుగ్గా పనిచేస్తాయని చెప్పింది.
చైనాలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 170కు పెరిగింది. దాదాపు 6 వేల మంది దాకా దాని బారిన పడ్డారు. మంగళవారం ఒక్కరోజే కేసులు 30 శాతం దాకా పెరిగాయి. చాలా ఎయిర్లైన్స్ సంస్థలు చైనా ట్రిప్పులను క్యాన్సిల్ చేశాయి. మరోవైపు గురువారం ఇండియాలోనూ తొలి కరోనా కేసు నిర్ధారణ అయింది. చైనా నుంచి కేరళకు వచ్చిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు వైద్య పరీక్ష్లో తేలింది. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.