
హైదరాబాద్, వెలుగు:నగరానికి చెందిన నిర్మాణ సంస్థ హోనర్ హోమ్స్ రూ. 3,000 కోట్ల వ్యయంతో హైటెక్ సిటీ సమీపంలో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది హైదరాబాద్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అని పేర్కొంది. హోనర్ ప్రైమ్ హౌసింగ్ ప్రమోటర్లు వెంకటేశ్, స్వప్న శంకర్, బాలు చౌదరి మీడియాతో మాట్లాడుతూ'హోనర్ సిగ్నాటిస్'ను 78 లక్షల చదరపు అడుగుల బిల్ట్ అప్ ఏరియాలో 28 ఎకరాల్లో నిర్మిస్తున్నామని చెప్పారు. మొత్తం 3,266 అపార్ట్మెంట్లు కడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం 90 లక్షల చదరపు అడుగుల జాగా నిర్మాణంలో ఉందని, దాదాపు 10 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్ట్లను భవిష్యత్తులో చేపడతామని వివరించారు. ‘‘మా సంస్థ ఇప్పటికే నగరంలో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు ఐజీబీసీ గ్రీన్బిల్డింగ్సర్టిఫికేషన్, 20 వేల అడుగుల్లో జిమ్, సీవరేజ్ మేనేజ్మెంట్ ప్లాన్, ఈవీ చార్జింగ్ పాయింట్లు, బ్యాంకు, హాస్పిటల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొత్తం 18 టవర్లు ఉంటాయి. ధరలు రూ.1.27 కోట్ల నుంచి రూ. మూడు కోట్ల వరకు ఉంటాయి. సిగ్నాటిస్లో 1,622 ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లు, 1,248 3.5 (చిన్న స్టడీ రూమ్ ఉంటుంది) రూమ్ల అపార్ట్మెంట్లు 1,248తోపాటు 385 నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లు ఉంటాయి. మాకు ఇప్పటికే 1,300 బుకింగ్స్ వచ్చాయి. ఫస్ట్ఫేజ్ డెలివరీలు 2026 డిసెంబరు నుంచి, రెండో ఫేజ్ డెలివరీలు 2027 డిసెంబరు నుంచి మొదలవుతాయి”అని వివరించారు.