ప్యాకేజీ 22 పనులపై చిగురిస్తున్న ఆశలు

ప్యాకేజీ 22 పనులపై చిగురిస్తున్న ఆశలు
  • కాంగ్రెస్​ పార్టీ ప్రయార్టీ ఇవ్వాలంటున్న రైతులు
  • పనులు పూర్తయితే 1.90 లక్షల ఎకరాలకు సాగునీరు
  • ఏండ్లు గడుస్తున్నా కంప్లీట్​ కానీ భూ సేకరణ

కామారెడ్డి, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకు సంబంధించిన కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులపై ఇక్కడి రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రయార్టీలో చేర్చి ఫండ్స్​రిలీజ్​చేస్తే, పన్నుల్లో స్పీడ్​ పెరిగే వీలుంది. ఫండ్స్ ​కొరత కారణంగా ఏండ్ల నుంచి భూసేకరణ కంప్లీట్​ కాలేదు. మెయిన్​ కెనాల్స్​తో పాటు, రిజర్వాయర్ల నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. సాగునీటి వనరులు లేని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని బీడు భూములను సస్యశామలం చేసే ఉద్ధేశంతో ప్యాకేజీ 22 పనులను ప్రతిపాదించారు.

2004లో అధికారంలోకి వచ్చిన అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం రాష్ట్రంలోని ఆయా ఏరియాలకు సాగు నీళ్లందించేందుకు డాక్టర్ ​బీఆర్ అంబేద్కర్​ సుజల స్రవంతి ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్ట్​ను చేపట్టింది. ఉమ్మడి నిజామాబాద్ ​జిల్లాలో 3,04,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్యాకేజీ 20,21,22 పనులు చేపట్టారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 22వ ప్యాకేజీ పనులతో లక్షా 90 వేల ఎకరాలకు నీరందించాలనుకున్నారు. ఈ ప్యాకేజీ పనుల కోసం అప్పట్లో రూ.1,446 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. రూ. 400 కోట్ల మేర పనులు జరిగాయి.

20, 21 ప్యాకేజీలు నిజామాబాద్​ జిల్లాకు సంబంధించినవి. అయితే ఇదే జిల్లాలోని మంచిప్ప కొండెం చెరువు నుంచి లిఫ్ట్​ ద్వారా కామారెడ్డి జిల్లాలోని సదాశివ్​నగర్​ మండలం భూంపల్లి రిజర్వాయర్​వరకు నీరు తీసుకొస్తారు. ఇక్కడి నుంచి లెఫ్ట్, రైట్​మెయిన్​కెనాల్స్​ ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని ఆయా ఏరియాలతో పాటు మెదక్​ జిల్లాలోని రామాయంపేట మండలాలకు సాగు నీళ్లు అందనున్నాయి. 

40 శాతం పనులే..

17 ఏండ్లలో 40 శాతం మేర ఈ ప్యాకేజీ పనులు పూర్తయ్యాయి. కొండెం చెరువు నుంచి ఇక్కడికి నీళ్లు రావడానికి రిజర్వాయర్ ​నిర్మాణం కంప్లీట్​కావాలి. రెట్, లెఫ్ట్​ మెయిన్​ కెనాల్స్ ​కొంత వరకు తవ్వకాలు జరిగాయి. లెఫ్ట్ ​కెనాల్​51 కిలోమీటర్లకు గాను 20 కిలోమీటర్లు, రైట్​కెనాల్​8 కిలోమీటర్లు తవ్వారు. భూంపల్లి వద్ద రిజర్వాయర్​ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఫైనల్ ​వర్క్స్​కావాలి.

మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ ప్రభుత్వం కొత్తగా మోతె, కాటేవాడి, తిమ్మక్​పల్లిల్లో రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించింది. సదాశివ్​నగర్​మండలం  యాచారం వద్ద 5.6 కిలోమీటర్ల సొరంగమార్గం తవ్వాల్సి ఉండగా, 30 శాతం మేర మాత్రమే పనులు కంప్లీట్​అయ్యాయి. ఇంకా మెయిన్​కెనాల్స్​తో పాటు, లింక్​కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ​ కెనాల్స్, రిజర్వాయర్ల  నిర్మాణం, సొరంగ మార్గం పనులు కంప్లీట్​కావాల్సి ఉంది. 

భూ సేకరణ కంప్లీట్​ కాలే

మెయిన్​ కెనాల్స్, సబ్​ కెనాల్స్​తో పాటు, రిజర్వాయర్లు, సొరంగ మార్గం కోసం 4,450 ఎకరాల భూమి అవసరం. ఇప్పటి వరకు 1,255 ఎకరాల భూమిని మాత్రమే సేకరించారు. ఆశించిన స్థాయిలో ఫండ్స్​రిలీజ్​ కాక అవసరమైన దాంట్లో సగం భూమిని కూడా సేకరించలేదు. సర్వే కంప్లీట్​ చేసిన భూమికి కూడా రైతులకు పరిహారం చెల్లించలేదు. సేకరించిన దాంట్లో ఇంకా రూ.20 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది.

గతంలో కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన ప్రాజెక్ట్​అయినందున తిరిగి ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన దృష్ట్యా ఈ పనులపై ఫోకస్​ చేస్తారని రైతులు ఆశిస్తున్నారు.ప్రభుత్వం కూడా ఆయా శాఖలకు సంబంధించి వర్క్స్, వీటి ప్రోగ్రెస్ ​రిపోర్ట్స్, ఫండ్స్​ రిలీజ్ ​లాంటి వివరాలు సేకరిస్తోంది. ఈ పరిస్థితుల్లో 22వ ప్యాకేజీ పనులు త్వరగా కంప్లీట్​ చేసి సాగు నీళ్లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.