
ములుగు, వెలుగు: రైతులు ఉద్యాన పంటలపై దృష్టిపెట్టాలని ఉద్యానవన కమిషనర్ యాస్మిన్ భాష సూచించారు. శుక్రవారం శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో వైస్చాన్స్లర్దండా రాజిరెడ్డి ఆధ్వర్యంలో జోనల్ రీసెర్చ్, ఎక్స్టెన్షన్ అడ్వైజర్ కౌన్సిల్ కార్యక్రమం నిర్వహించగా కమిషనర్ యాస్మిన్ భాష ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉద్యానవన పంటల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 145 కోట్ల నిధులను విడుదల చేసిందని, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైస్చాన్స్లర్రాజిరెడ్డి మాట్లాడుతూ మారుతున్న వాతావరణానికి అనుకూలంగా వ్యవసాయం చేయాలని రైతులకు సూచించారు. రైతుల అడిగిన పలు సమస్యలకు శాస్త్రవేత్తలు పలు సమాధానాలు చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, డీన్ చీనా నాయక్, డైరెక్టర్ లక్ష్మీనారాయణ, డీన్ సురేశ్ కుమార్, రాజశేఖర్, శ్రీనివాస, అనితకుమారి, సుచిత్ర, మహేందర్, శ్రీనివాస్, సైదయ్య, వెంకటలక్ష్మి, వీణ జోషి పాల్గొన్నారు.