
- భారీ పెనాల్టీలకు అవకాశం
న్యూఢిల్లీ: ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా సబ్బో సర్ఫో కొన్నాలన్నా యూపీఐ వంటి డిజిటల్పేమెంట్స్ వాడుతున్నారు. జేబు నుంచి డబ్బు తీసి కొనేవారి సంఖ్యా తక్కువేమీ లేదు. రోజువారీ ఖర్చుల కోసమో అత్యవసరాల కోసమో చాలా మంది ఇంట్లో డబ్బును దాచి పెట్టుకుంటున్నారు. చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఇంట్లో ఎంత డబ్బు దాచుకోవచ్చో తెలుసా ? ఇంత మొత్తం వరకే దాచిపెట్టాలనే రూలేమీ లేదు.
ఆ డబ్బును లీగల్గానే సంపాదించుకున్నామని మాత్రం నిరూపించుకోవాలి. లేకపోతే చిక్కులు తప్పవు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా భారీ మొత్తంలో డబ్బు దాస్తే సమస్యలు రావొచ్చు. ఐటీ అధికారులకు జవాబు చెప్పలేకపోతే భారీ ఎత్తున పెనాల్టీలు పడతాయి.
ఎక్స్పర్టులు ఏమంటున్నారంటే..
ఆర్థిక సేవలు అందించే ఈఎక్స్ఎల్లో మేనేజర్భూపేశ్ జిదానీ మాట్లాడుతూ వ్యక్తులు ఇంట్లో డబ్బు దాచడానికి పరిమితులు ఏమీ లేవన్నారు. అయితే లెక్కల్లో చూపని డబ్బు ఉంటే మాత్రం ఐటీ చట్టంలోని సెక్షన్69ఏ కింద 60 శాతం వరకు పెనాల్టీ, సర్ చార్జ్, సెస్ కట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐటీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు డబ్బు దొరికితే కచ్చితంగా సంబంధిత డాక్యుమెంట్లను వాళ్ల ముందు ఉంచాలని స్పష్టం చేశారు.
ఆర్బీఐ రూల్స్ప్రకారం వ్యక్తుల దగ్గర రూ.50 వేల కంటే ఎక్కువ క్యాష్ ఉంటే బ్యాంకుకు రిపోర్ట్ చేయాలి. డబ్బు దాయడానికి పరిమితులు లేకపోయినా అవి ఎక్కడి నుంచో వచ్చాయో తెలియజేయాలని చార్టెర్డ్ ఎకౌంటెంట్ప్రాంజల్ గుప్తా అన్నారు. రహస్యంగా దాచిన డబ్బుపై 137 శాతం వరకు పెనాల్టీ పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒక వ్యక్తి ఒక రోజులో రూ.రెండు లక్షలు లేదా ఇంతకుమించి డబ్బును సింగిల్ట్రాన్సాక్షన్లో తీసుకోకూడదు.
ఇలా చేస్తే సెక్షన్269 ఎస్టీ ప్రకారం వంద శాతం పెనాల్టీ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. రూ.20 వేలు లేదా ఇంతకు మించిన మొత్తాన్ని క్యాష్ రూపంలో లోన్ కోసం కట్టకూడదు. ఆర్థిక సంస్థలూ ఆమోదించకూడదు. ఇలా చేస్తే 269ఎస్ఎస్, 269టీ ప్రకారం పెనాల్టీలు వేస్తారు. బ్లాక్ మనీని అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి ఈ రూల్స్ తీసుకొచ్చారని పన్ను అధికారులు అన్నారు. భారీ లావాదేవీలకు డిజిటల్ పేమెంట్ విధానాలనే వాడాలంటున్నారు.