ఈ ఏడాది ఎలా గడిచిందో చెప్పండి: ప్రధాని మోడీ

ఈ ఏడాది ఎలా గడిచిందో చెప్పండి: ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎలా గడిచిందనే దానిపై తమ అభిప్రాయాలు, ఆలోచనలను చెప్పాల్సిందిగా దేశ పౌరులను ప్రధాని మోడీ కోరారు. ఈ సంవత్సరం చివరి ఎడిషన్ ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో వీటి గురించి మాట్లాడతానని మోడీ చెప్పారు. ‘ఈ ఏడాది ఎలా గడిచిందని మీరు భావిస్తున్నారు? 2021ను ఎలా చూడాలని అనుకుంటున్నారు? దీని గురించి మీ అభిప్రాయాలను షేర్ చేయండి’ అని మోడీ ట్వీట్ చేశారు. ఈ ఏడాది పై కరోనా ప్రభావం ఎంతగా చూపించిందో తెలిసిందే.