మేడారానికి పోటెత్తిన భక్తులు

మేడారానికి పోటెత్తిన భక్తులు

ములుగు జిల్లా మేడారానికి భక్తులు పోటెత్తారు. జవనరి 28వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ముందస్తుగా వన దేవతలకు మొక్కులు సమర్పించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

వన దేవతలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. మహాజాతరకు ఇంకా నెల రోజుల సమయ ఉన్నా... భక్తులు ముందే వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే రెండు లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా అన్ని ఏర్పాటు పూర్తి చేశామని చెప్పారు.