యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భారీ సంఖ్యలో  భక్తులు పోటెత్తారు.  వరుస సెలవులు రావడం, ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలోని భక్తులతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.  

స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.   కొండపైన ఉన్న బస్‌ బస్టాండ్, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం కొనసాగుతున్నది.  

ఇక ఏప్రిల్ 8 శనివారం రోజున నారసింహస్వామిని దాదాపుగా 30వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. దీంతో వివిధ రకాల కానుకాల ద్వారా రూ.51,62,780  ఆదాయం వచ్చిందని తెలిపారు.