
- పక్కనే ఉన్న 3 షాపులకు వ్యాపించిన మంటలు
- 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
కూకట్ పల్లి, వెలుగు: ఫర్నిచర్ షోరూంలో అగ్ని ప్రమాదం ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలో జరిగింది. కేపీహెచ్బీ మెట్రో స్టేషన్ సర్వీస్ రోడ్లోని ఎమ్ఎస్ ఫర్నిచర్ షోరూమ్లో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఫర్నిచర్ షోరూమ్పైన రెండంతస్తుల్లోని షాపులకు, గ్రౌండ్ ఫ్లోర్లోని చెప్పుల దుకాణానికి మంటలు వ్యాపించాయి.
స్థానికులు భయాందోళనతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 4 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.