బీజాపూర్లో భారీ డంప్ స్వాధీనం

బీజాపూర్లో భారీ డంప్ స్వాధీనం

భద్రాచలం, వెలుగు :  చత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో శనివారం భద్రతాబలగాలు శనివారం మావోయిస్టులకు చెందిన భారీ డంపును స్వాధీనం చేసుకున్నాయి. జిల్లాలోని మద్దేడ్​ పోలీస్​స్టేషన్ పరిధి బందేపారా-నీలమడుగు గ్రామాల మధ్య అడవుల్లో డీఆర్జీ, సీఆర్​పీఎఫ్​ బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి. తనిఖీలు నిర్వహిస్తుండగా మావోయిస్టుల డంప్​ కన్పించింది. వెంటనే బాంబ్​ డిస్పోజల్ టీమ్​లను రంగంలోకి దించారు. 

డంప్​ను తెరవగా అందులో 16 ప్రెషర్​ బాంబులు, వంద కిలోల బరువు కలిగిన 784 జిలిటిన్​ స్టిక్స్, 3 బండిళ్ల ఎలక్ట్రిక్ వైరు, 350 మీటర్ల యూనిఫాం కుట్టేందుకు తెచ్చిన క్లాత్, కిలో గన్​పౌడర్, వాకీటాకీలు 4, బ్యాటరీలు 4, మొబైల్​ఛార్జర్లు 2, విప్లవసాహిత్యం, బియ్యం, నూనె, సబ్బులు, కిట్​బ్యాగులతో కూడిన భారీ సంఖ్యలో వస్తువులు దొరికాయి. వెంటనే బీడీఎస్​ టీం 16 ప్రెషర్​ బాంబులను నిర్వీర్యం చేసింది. మద్దేడు పోలీస్​స్టేషన్​కు వాటిని తరలించారు.